ప్రధాని నరేంద్ర మోదీ ‘GOAT’.. మాజీ క్రికెటర్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు

-

భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు, ప్రముఖ వ్యాఖ్యాత రవిశాస్త్రి తాజాగా దేశ ఐక్యతపై , ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు. పాకిస్తాన్‌తో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో, దేశం ఏకమై ముందుకు సాగుతున్న తీరు అతని హృదయాన్ని తాకిందని పేర్కొన్నారు.

“నా క్రీడా జీవితంలో ఎన్నో యునైటెడ్ జట్లను చూసాను. కానీ, 150 కోట్ల మంది ప్రజలు ఒకే జట్టు వలె ఏకమై  ఉన్న దృశ్యం ఇదే మొదటిసారి,” అని రవిశాస్త్రి ట్వీట్ చేశారు. దేశ ప్రజల ఐక్యత, సైనిక బలగాల స్థైర్యాన్ని ఆయన కీర్తిస్తూ, ఈ సమష్టి శక్తికి నాయకత్వం వహిస్తున్న ప్రధాని మోదీని ‘GOAT కెప్టెన్’ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)గా అభివర్ణించారు.

ప్రస్తుత భారతదేశాన్ని ఒక అద్భుతమైన జట్టు అని వ్యాఖ్యానించిన రవిశాస్త్రి, “ఇంత బలమైన నాయకత్వం, ఇంత గొప్ప ఐక్యత ఉన్న దేశాన్ని చూడటం గొప్ప గౌరవం. మోదీ జీ , ప్రభుత్వం దీన్ని నిఖార్సైన క్రీడా జట్టు మాదిరిగా నడిపిస్తున్నారు” అని పేర్కొన్నారు. తన ట్వీట్‌ను “జై హింద్!” అంటూ ముగించిన రవిశాస్త్రి, దేశం పట్ల తన గౌరవాన్ని స్పష్టంగా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news