సర్ఫరాజ్ కి క్షమాపణ చెప్పిన రవీంద్ర జడేజా

-

ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం చేశారు. ఇక ఈ టెస్టులో యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ స్టన్నింగ్ ఇన్నింగ్స్ ఆడుతూ రనౌట్ అయ్యారు.62 పరుగులతో మంచి టచ్లో ఉండగా 99రన్స్ వద్ద ఉన్న జడేజా రన్ కోసం కాల్ ఇచ్చారు. మళ్లీ వెంటనే వద్దని చెప్పడంతో అప్పటికే సర్ఫరాజ్ రనౌట్ అయ్యారు. సీనియర్ క్రికెటర్ జడేజా.. యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ను క్షమాపణ చెప్పారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా జడేజా ‘బాధగా ఉంది. నాదే తప్పు. నువ్వు బాగా ఆడావు’ అని పోస్ట్ చేశారు.

 

ఇదిలా ఉంటే….రాజ్కోట్ వేదికగా ఇంగ్లండ్ , ఇండియా మధ్య జరుగుతున్న మూడో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఇండియా 5 వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. క్రీజులో జడేజా (110), కుల్దీప్ యాదవ్ (1) ఉన్నారు. ఈ టెస్ట్ లో కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ తో కదం తొక్కారు.ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 3, హార్ట్ ఒక వికెట్ పడగొట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news