చంద్రబాబు నాయుడు తెలంగాణకు వెళ్లిపోవడం ఖాయం : కేశినేని నాని

-

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత, ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం నాని మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు టికెట్లు అమ్ముకొని చివరకు తెలంగాణకు వెళ్లిపోతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవే చంద్రబాబు చివరి ఎన్నికలు అని.. ఓటమి తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటారని అని అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ను చూసి చంద్రబాబు సిగ్గు తెచ్చుకోవాలని సూచించారు. చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడు అని.. ఆయన మాటలను నమ్మే పరిస్థితుల్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు లేరని ఆరోపించారు.

 

 

2015లో చంద్రబాబు నాయుడు ని నమ్మి మోసపోయామని వారికి తెలుసని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు వైసీపీదే అని స్పష్టం చేశారు.అనంతరం మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ..టీడీపీ చీఫ్ చంద్రబాబు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ అని ఎద్దేవా చేశారు. ‘ఎన్టీఆర్ పదవిని, ఎన్టీఆర్ ట్రస్టును బాబు లాక్కున్నారు. టీడీపీ నేతలు తెలివి తక్కువ దద్దమ్మలు. నాకు చంద్రబాబులాగా కుర్చీ లాక్కునే లక్షణం లేదన్నారు. ముఖ్యమంత్రి జగన్ కుర్చీలో నేను కూర్చోలేదు. సీఎం సమీక్షలు నిర్వహించే గదిలో కూర్చున్నా. సీఎం జగన్ తలచుకుంటే ఎవ్వరినైనా ఎక్కడైనా కూర్చోబెడతారు’ అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news