అవన్నీ ప్రజలకు చెబుదాం సిద్ధం కండి : పవన్ కళ్యాణ్

-

వైసీపీ ప్రభుత్వంపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలతో పవన్ కల్యాణ్ భేటీ అయి ఎన్నికల బహిరంగ సభల నిర్వహణపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ…..ఇసుక, మైనింగ్, మద్యం అక్రమార్జన సొమ్ముతో వైసీపీ ఎన్నికల బరిలోకి దిగుతోందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ‘రాష్ట్రంలో అడ్డగోలుగా ఇసుకను దోచేస్తోంది అని విమర్శించారు. అలాగే నకిలీ మద్యం విక్రయించి అమాయకుల ప్రాణాలను హరిస్తోంది .

 

దీనిపై అధికారులు కూడా మౌనంగా ఉండటం బాధాకరం అని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం ప్రజా క్షేమాన్ని విస్మరించింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టండి’ అని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.బహిరంగ సభల ద్వారా వైసీపీ దుర్మార్గం ఏ స్థాయిలో ఉందో ప్రజలకు చెబుతామని అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news