నేను ఉరికి వేలాడితే.. అది ఆత్మహత్య కాదు : కంగనా

-

ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకున్నప్పటినుంచి కంగనా టీం మరింత ఘాటుగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. సుశాంత్ సింగ్ ది ఆత్మహత్య కాదని హత్య అంటూ ఎన్నో ఆరోపణలు చేస్తోంది కంగన టీమ్.

తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసి మరో కొత్త వివాదానికి తెరలేపింది కాంగనా టీమ్ . సుశాంత్ మృతి వెనక ఓ పెద్ద వ్యక్తి పేరు ఉందనే వార్తలు వస్తున్నాయి, అతను ఎవరు అనేదానిపై కూడా ట్విట్టర్ వేదికగా ఎంతగానో చర్చ జరుగుతుంది. ఇక దీనిపై స్పందించిన కంగనా రనౌత్ టీం సంచలన వ్యాఖ్యలు చేసింది. అతని పేరు అందరికీ తెలిసిన ఎవరు చెప్పారు అతను కరణ్ జోహార్ కి బెస్ట్ ఫ్రెండ్.. అత్యుత్తమ ముఖ్యమంత్రి కుమారుడు.. బేబీ పెంగ్విన్ అని అతని పిలుస్తూ ఉంటారు. ఇక ముందు కంగనా ఇంట్లో ఉరి వేసుకొని వేలాడుతూ కనిపిస్తే అది ఆత్మహత్య కాదు అని మాత్రం గ్రహించండి అంటూ సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ పెట్టింది కంగనారనౌత్ టీం.

Read more RELATED
Recommended to you

Exit mobile version