బంజారాహిల్స్‌ లో వైఎస్‌ఆర్‌ కు రేవంత్‌, భట్టి నివాళులు

-

బంజారాహిల్స్‌ లో వైఎస్‌ఆర్‌ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి నివాళులు అర్పించారు. డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 75 వ జయంతి సందర్భంగా బంజారాహిల్స్ లోని సిటీ సెంటర్ వద్దనున్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు రేవంత్‌, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.

Revanth and Bhatti Tribute to YSR in Banjara Hills

ఈ కార్యక్రమంలో రేవంథ్‌, ఉప ముఖ్యమంత్రి తో పాటు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ నగరం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి , ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు దానం నాగేందర్ మాజీ రాజ్యసభ సభ్యులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కెవిపి రామచందర్రావు గారు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, ఏఐసిసి కార్యదర్శి- సీడబ్ల్యూసీ సభ్యులు చల్లా వంశీ చందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు చల్ల నరసింహారెడ్డి, టీపీసీసీ బీసీ సెల్ చైర్మన్ మూర్తి శ్రీకాంత్ గౌడ్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. అటు ప్రజాభవన్‌లో వైఎస్సార్‌ ఫోటో ఎగ్జిబిషన్‌. పంజాగుట్టలో వైఎస్సార్‌ విగ్రహానికి రేవంత్‌, భట్టి నివాళి అర్పిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news