రేవంత్ రెడ్డి పై మండిపడుతున్న డీకే అరుణ..!

-

రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ జిల్లాకి ఏం చేస్తారో చెప్పకుండా అడ్డగోలుగా మాట్లాడుతున్నారని బిజెపి అభ్యర్థి పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆరుసార్లు వచ్చారు అంటే కాంగ్రెస్ కి ఓటమి భయం మొదలైందని చెప్పారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ నిన్న కొండగల్ లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అరుణతో పోటీ పొంతన ఏంటని అన్నారు.

ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఆమె రేవంత్ రెడ్డికి పోటీ కానప్పుడు తమపై ఎందుకు విమర్శలు చేస్తున్నారని అడిగారు. రేవంత్ రెడ్డి తిట్టడమే కాకుండా ఆయన చెంచాలతో నీతి వ్యాఖ్యలు పలికిస్తున్నారని వారి మీద వారికి నమ్మకం లేక ఇలా చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. ఎక్కడికి వెళితే అక్కడ దేవుడు మీద ఒట్టు వేస్తున్నారని ఓట్ల కోసం దేవుళ్ళ మీద ఒట్లు వేస్తారా అని ఆమె అడిగారు.

 

Read more RELATED
Recommended to you

Latest news