రేవంత్ రెడ్డి: రాహుల్ యాత్ర పై కుట్రపూరిత దాడి..!

-

కాంగ్రెస్ అగర నేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా అస్సాం లో పర్యటన చేశారు ఈ క్రమంలో స్వల్ప ఉద్రక్తంగా చోటు చేసుకుంది అస్సాం లో సోనిత్పూర్ లో యాత్ర ని బిజెపి కార్యకర్తలు అడ్డుకున్నారు. కాంగ్రెస్ బిజెపి కార్యకర్తలు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు వచ్చి ఇరు వర్గాలని చెదరగొట్టారు ఈ ఘటన మీద కాంగ్రెస్ అగ్రనేతలు ఫైర్ అయ్యారు. ఈ ఘటన వెనుక అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ హస్తము ఉందని ఆరోపిస్తున్నారు.

ఇది ఇలా ఉంటే ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన ట్వీట్ ని పోస్ట్ చేయడం జరిగింది. బిజెపి పాలిత అస్సాంలో రాహుల్ గాంధీ భారత్ జూడో న్యాయ యాత్రపై కుట్రపూరిత దాడుల్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. దేశ స్వతంత్రం కోసం పోరాడిన పార్టీగా కాంగ్రెస్ యాత్ర ముందుకు సాగాలన్న మా సంకల్పం మరింత బలపరుస్తుంది అని రేవంత్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news