సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి ఘాటు విమర్శలు చేశారు. అడ్డిమారి గుడ్డిదెబ్బన సీఎం అయ్యావు..ఇకనైనా బుద్దితెచ్చుకుని మాట్లాడు..అంటూ శనివారం ఉదయం తెలంగాణ భవన్ వేదికగా విమర్శలు గుప్పించారు.
‘ఇప్పటికైనా కేసీఆర్ను తిట్టుడు, బూతులు మాట్లాడటం, తెలంగాణను శాపం పెట్టుడు బంద్ చేయి యాక్సిడెంటల్ సీఎం రేవంత్ రెడ్డి.తెలంగాణను ఎవరు తిట్టినా వాళ్లకు ఇలానే సమాధానం చెప్తాను. నువ్వు సిగ్గులేనోడివి కాబట్టి తెలంగాణను ఒక క్యాన్సర్ రోగితో పోల్చావు, ఒక వ్యాధిగ్రస్తమైన రాష్ట్రంగా మాట్లాడావు.రేవంత్ రెడ్డి నువ్వు మూర్ఖుడువి..మీ ఉపముఖ్యమంత్రి ఇచ్చిన నివేదిక చదివి సిగ్గు తెచ్చుకో’ అంటూ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు.
ఇప్పటికైనా కేసీఆర్ను తిట్టుడు, బూతులు మాట్లాడటం, తెలంగాణను శాపం పెట్టుడు బంద్ చేయి యాక్సిడెంటల్ సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణను ఎవరు తిట్టినా వాళ్లకు ఇలానే సమాధానం చెప్తాను
నువ్వు సిగ్గులేనోడివి కాబట్టి తెలంగాణను ఒక క్యాన్సర్ రోగితో పోల్చావు, ఒక వ్యాధిగ్రస్తమైన రాష్ట్రంగా… pic.twitter.com/a6r2Pr7D8T
— Telugu Scribe (@TeluguScribe) February 22, 2025