చిరు-పూరి కాంబోలో సినిమా… రామ్​ గోపాల్​ వర్మ ఏం అన్నారంటే?

-

మెగాస్టార్‌ చిరంజీవి, ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో సినిమా వస్తే చూడాలని సినీ ప్రియులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ప్రయత్నాలు జరిగినప్పటికీ సఫలీకృతం కాలేదు. కాగా, బుధవారం విడుదలైన ఇంటర్వ్యూ తర్వాత పూరీ – చిరు కాంబో మరోసారి వార్తల్లో నిలిచింది. దీనిపై తాజాగా వర్మ స్పందించారు.

చిరు-పూరీ ఇంటర్వ్యూ వీడియోని షేర్‌ చేసిన వర్మ.. ‘‘సినిమా అంటే ప్రేమ కనబరిచే ఇద్దరు వ్యక్తుల నిజమైన కాంబినేషన్‌ ఇది. వీళ్లిద్దరిని ఇలా చూస్తుంటే అద్భుతంగా ఉంది. వీళ్లిద్దరి కాంబో కోసం నేను ఎదురుచూస్తున్నా’’ అని పేర్కొన్నారు.

పొలిటికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘గాడ్‌ఫాదర్‌’ తో విజయాన్ని అందుకున్నారు చిరంజీవి. మోహన్‌ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూరీ జగన్నాథ్‌ ‘గోవర్ధన్‌’ అనే విలేకరిగా కనిపించారు. ఈ సినిమా విజయం సాధించిన నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ ఓ స్పెషల్‌ వీడియో షేర్‌ చేసింది. ఇందులో చిరంజీవిని పూరీ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ క్రమంలోనే చిరు.. ‘ఆటోజానీ’ని ఏం చేశావు? అని ప్రశ్నించగా.. ‘‘అది పాత కథ. మీ కోసం ఇప్పుడు అంతకంటే మంచి కథ రాస్తా. త్వరలోనే మిమ్మల్ని కలిసి వినిపిస్తా’’ అని బదులిచ్చాడు. దీంతో పూరీ-చిరు కాంబో మరోసారి వార్తల్లోకి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version