ధోనీని మించిపోయిన రింకూ సింగ్.. ఐపీఎల్ లో సరికొత్త రికార్డ్

-

 

 

 

ఐపీఎల్ 2023 లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ గుజరాత్ టైటాన్స్ పై ఘన విజయాన్ని సాధించింది . గుజరాత్‌ టైటాన్స్‌ పై జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో అనూహ్య విజయాన్ని అందుకుంది కేకేఆర్. కేవలం ఆరు బంతుల్లోనే 31 పరుగులు కావాల్సిన సమయంలో చివరి ఓవర్‌లో రింకు విశ్వరూపం ఎత్తాడు.

ఏకంగా 5 సిక్స్‌లతో జట్టుకు విజయాన్ని అందించాడు రింకు. అయితే చివరి ఓవర్ లో ఫినిషింగ్ అంటే అందరూ ధోని గురించి మాట్లాడుకుంటారు. అందుకు తగ్గట్లే ఐపిఎల్ లో చివరి ఓవర్ పరుగుల చేతనలో 24 పరుగులతో ధోనీనే టాప్ లో ఉన్నాడు. ఆర్సిబి పై ఈ రన్స్ కొట్టాడు మహేంద్రసింగ్ ధోని. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేసిన రింకూ సింగ్… ఏకంగా 30 రన్స్ కొట్టి టాప్ లోకి వచ్చేసాడు. దీంతో ధోని రికార్డు బద్దలైంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version