ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025లో తొలిసారి మైదానంలో రోబో డాగ్ సందడి చేసింది. నిన్న ముంబై వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ ప్రారంభానికి ముందు ప్రేక్షకులకు ఈ రోబో డాగ్ సరికొత్త అనుభూతిని కలిగించిందిని చెప్పుకోవచ్చు.
ప్రేక్షకుల కోసమే ఐపీఎల్లో AI రోబో డాగ్ను బీసీసీఐ ప్రవేశపెట్టినట్లు సమాచారం.ఈ క్రమంలోనే ముంబై, ఢిల్లీ మ్యాచ్కు ముందు ప్రాక్టిస్ సమయంలో ప్లేయర్లను రోబో డాగ్ పలకరించింది. అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యాలకు షేక్ హ్యాండ్ ఇవ్వడంతో పాటు కామెంటేటర్ మారిసన్ వాయిస్ కమాండ్లకు తగినట్లుగా ప్రవర్తిస్తూ ఆటగాళ్లను రోబో డాగ్ అలరించింది.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఐపీఎల్ లో రోబో డాగ్ సందడి..
ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు ఐపీఎల్ లో AI రోబో డాగ్ను ప్రవేశపెట్టిన బీసీసీఐ.
ముంబై, ఢిల్లీ మ్యాచ్కు ముందు ప్రాక్టిస్ సమయంలో ప్లేయర్లను పలకరించిన రోబో డాగ్.
అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యాలకు షేక్ హ్యాండ్ ఇవ్వడంతో పాటు కామెంటేటర్… pic.twitter.com/sv0OQwCNqF— ChotaNews App (@ChotaNewsApp) April 14, 2025