ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం..మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా

-

ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘోర అగ్ని ప్రమాదంలో ఏకంగా 27 మంది మరణించారు. మరో 50 మందికి తీవ్ర గాయాలు అయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఇంకా మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్‌ ఉంది. పశ్చిమ ఢిల్లీలోని ముండ్కా మెట్రో స్టేషన్‌ కు సమీపంలో ఉన్న నాలుగు అంతస్తుల సాయంత్రం 4 గంటలకు మంటలు చెలరేగాయి.

ఈ ప్రమాదం నుంచి చాలా మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చామని పోలీసులు వెల్లడించారు. దాదాపు 24 ఫైర్‌ ఇంజన్లు మంటలు ఆర్పే ప్రయత్నం చేశాయని స్పష్టం చేశారు. అగ్ని ప్రమాదం జరిగిన భవనంలో నుంచి కొందరు కిందకు దూకేశారని అధికారులు చెబు తున్నారు. ఇక ఈ ప్రమాద ఘటన గురించి తెలుసుకుని కలత చెందామని రాష్ట్రపతి కోవింద్‌, ప్రధాని మోడీ పేర్కొ న్నారు. అంతేకాదు.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌ గ్రేషియా ప్రకటిస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటన చేశారు. గాయపడ్డవారికి రూ.50 వేలు ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version