IPL 2023 : నేడు ముంబైతో హైదరాబాద్‌ ఢీ.. ఉప్పల్‌ స్టేడియానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

-

ఐపిఎల్ 2023 చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఐపిఎల్ 2023 లో ఇప్పటి వరకు 24 మ్యాచ్ లు పూర్తి అయ్యాయి. ఈ రోజు ఐపిఎల్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు ముంబై ఇండియన్స్ జట్ల మధ్యన హైదరాబాద్ వేదికగా మ్యాచ్ జరగనుంది.

కాగా రెండు జట్లు కూడా ఈ టోర్నీని అపజయాలతో ప్రారంభించి ఆ తర్వాత రెండు వరుస విజయాలను సాధించి కొంచెం గాడిన పడ్డాయి. ఇప్పుడు ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ఎవరు గెలుస్తారు అన్న విషయం పట్ల అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

ఈ మ్యాచ్ ఇవాళ రాత్రి 7.30 గంటలకు జరుగనుంది. ఈ తరుణంలో తెలంగాణ ఆర్టీసీ… క్రికెట్ ఫ్యాన్స్ కు అదిరిపోయే శుభభార్త చెప్పింది. ఈ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియానికి ప్రత్యేకంగా బస్సులు నడిపిస్తామని… అర్ధరాత్రి వరకు బస్సులు నడుస్తాయని తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. దీనికోసం ప్రత్యేకంగా బస్సులు దించుతున్నామని ప్రకటన చేసింది తెలంగాణ ఆర్టీసీ.

 

Read more RELATED
Recommended to you

Latest news