వైసీపీకి ఓటేసే వారిని, వేయని వారిని గుర్తించండి: ధర్మాన

-

వైసీపీకి ఓటేసే వారిని, వేయని వారిని గుర్తించండని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాదరావు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఎవరికి ఓటు వేస్తారనే విషయం గుర్తించాలని వాలంటీర్లకు సూచనలు చేశారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.

వైసిపికి ఓటు వేసేవారు మరియు వైసీపీకి ఓటేయని వారు అలాగే తటస్థంగా ఉండేవారిని వేరువేరుగా గుర్తించాలని ఆయన కోరారు. ఎవరైనా వైసిపికి ఓటేస్తామని చెబితే వారి చేత దేవుడిపై ఒట్టేయించాలని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో వైసిపి గెలవకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని… జనాల్లోకి తీసుకుపోవాలని మంత్రి ధర్మన ప్రసాదరావు కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news