గుడ్ న్యూస్ : వాక్సిన్ తర్వాత రూ750 మాత్రమే..!

-

ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో ఎవరూ ఊహించని విధంగా రష్య వ్యాక్సిన్ తెరమీదకి వచ్చింది అనే విషయం తెలిసిందే. ప్రపంచ దేశాలు రష్యా వ్యాక్సిన్పై అనుమానాలు వ్యక్తం చేశాయి. కాగా రష్యాకు చెందిన స్పుత్నిక్ వ్యాక్సిన్ 95% ప్రభావవంతంగా ఉన్నట్లు ఆ దేశం పేర్కొంది. ఇటీవలే క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా రెండో మధ్యంతర ఫలితాలకు సంబంధించిన నివేదికను విడుదల చేసిన రష్యా వ్యాక్సిన్ సామర్థ్యాన్ని తెలిపింది.

కాగా భారత్లో ప్రస్తుతం స్పుత్నిక్ తో కలిసి డాక్టర్ రెడ్డి పనిచేస్తుంది. ఈ సందర్భంగా ఈ వ్యాక్సిన్ యొక్క ధరను కూడా నిర్ణయించింది సంస్థ. అంతర్జాతీయ మార్కెట్లో ఈ వ్యాక్సిన్ 10 డాలర్లు గా నిర్ణయించింది. దీని ప్రకారం భారత కరెన్సీలో ఈ వ్యాక్సిన్ యొక్క ధర 750 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఇప్పటికే అంతర్జాతీయ ఉత్పత్తిదారులతో ఒప్పందా లు కుదుర్చుకుంటున్నట్లు సదరు సంస్థ వెల్లడించింది. ఏడాదిలో ఒక 500 మిలియన్ల డాలర్లను ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news