కరోనా వ్యాక్సిన్.. గుడ్ న్యూస్ చెప్పిన నరేంద్ర మోడీ..!

-

మొన్నటి వరకు భారతదేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ వచ్చింది అన్న విషయం తెలిసిందే. కానీ శీతాకాలం మొదలైనప్పటి నుంచి పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు ప్రధాని నరేంద్ర మోదీ,

ఈ క్రమంలోనే కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గ్లోబల్ సంస్థలతో వ్యాక్సిన్ గురించి చర్చలు జరుపుతున్నారు అన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు ప్రధాని నరేంద్ర మోడీ. అయితే వ్యాక్సిన్ ధర ఎంత విధించాలి అనేదానిపై ఇప్పటివరకు ఒక నిర్ణయానికి రాలేదు అంటూ తెలిపిన నరేంద్ర మోడీ ప్రస్తుతం భారత్లో రెండు సంస్థలు వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ లో శరవేగంగా ముందుకు వెళ్తున్నాయి అంటూ చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news