నేటి నుంచి శబరిమల ఆలయం మూసివేత

-

శబరిమల వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ట్‌. నేటి నుంచి శబరిమల ఆలయం మూసివేయనున్నారు అధికారులు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. శబరిమలలో దర్శనాలు ముగిశాయి. ఇవాళ ఉదయం ప్రత్యేక పూజలతో శబరిమల ఆలయాన్ని మూసివేయనున్నారు.

అయ్యప్పస్వామిని 50 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. ఆలయానికి ఇప్పటివరకు రూ. 357 కోట్లకు పైగా ఆదాయం చేకూరింది. కాగా మొన్నటి వరకు కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి రద్దీ విపరీతంగా ఉండేది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి భక్తులు శబరిమలకు పోటెత్తారు. రోజుల తరబడి దర్శనానికి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఎదురౌంది. భక్తులు ఎక్కువగా ఉన్న తరుణంలో.. కొంత మంది భక్తులు వెనక్కి కూడా వెళ్లారు.

Read more RELATED
Recommended to you

Latest news