U19 world cup :బంగ్లదేశ్ పై 84 రన్స్ తేడాతో ఇండియా ఘనవిజయం…..

-

అండర్-19 వరల్డ్ కప్ లో భారత్ బోణీ కొట్టింది. బ్లోమ్‌ఫోంటెయిన్ వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో ఉదయ్ సహారన్ నేతృత్వంలోని టీమ్ ఇండియా   84 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది.మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. ఆ తర్వాత 252 పరుగుల పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా 167 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఓపెనర్ ఆదర్శ్ సింగ్ 76 రన్స్, కెప్టెన్ ఉదయ్ సహారన్ 64 రన్స్ సహకారంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది.ఇక బౌలర్లలో శౌమీ పాండే 4 వికెట్లు, ముషీర్ ఖాన్ 2 వికెట్లు తీశారు.

 

బంగ్లా బ్యాటర్లలో మహ్మద్ షిహాబ్ జేమ్స్(54) రన్స్ తో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. బౌలర్లలో మరూప్‌ మిరందా 5 వికెట్లు తీశాడు. కాగా.. ఈ మెగా టోర్నీలో భారత్ తర్వాత మ్యాచ్‌లో జనవరి 25న బ్లోమ్‌ఫోంటెయిన్ వేదికగా ఐర్లాండ్‌తో తలపడనుంది.

Read more RELATED
Recommended to you

Latest news