నాటు నాటు పాటకు స్టెప్పులు వేసిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్

-

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రికెట్ లీగ్ లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే.టెన్నిస్ బాల్‏తో నిర్వహించే ఐఎస్పీఎల్ లీగ్‏లో హైదరాబాద్ జట్టును కొనుగోలు చేసినట్లు రామ్ చరణ్ గతంలోనే ప్రకటించారు. సూర్య, అక్షయ్ కుమార్ వంటి స్టార్లు కూడా టీమ్ లను కొనుగోలు చేశారు.

ఇదిలా ఉంటే ….ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ వేడుకలో సెలబ్రిటీలు, క్రికెటర్లు సందడి చేశారు. ఐఎస్పీఎల్ టీ10 లీగ్ థానేలో దడోజి కోనదేవ్ స్టేడియంలోని ప్రారంభమయ్యింది.సచిన్ టెండూల్కర్, రామ్ చరణ్, సూర్య, అక్షయ్ కుమార్ ‘నాటు నాటు’ పాటకు స్టెప్పులు వేసి అలరించారు. వారి డాన్స్కు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ టోర్నీ టెన్నిస్ బాల్తో టీ10 ఫార్మాట్లో జరుగుతుంది. హైదరాబాద్,చెన్నై, ముంబై, కోలకతా,బెంగళూరు, శ్రీనగర్ జట్లు పోటీ పడుతున్నాయి. మార్చి 15న ఫైనల్ జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news