తెలంగాణలో దారుణం.. మామిడికాయ దొంగతనం చేశారని, నోట్లో పేడ కుక్కి !

-

పాపం మామిడి కాయలు తినాలని ఉబలాట పడి మామిడి తోటల్లోకి వెళ్ళిన అభం శుభం తెలియని పిల్లల మీద దారుణానికి పాల్పడ్డారు ఇద్దరు వ్యక్తులు. చెట్టుకు కట్టి తాడుతో కట్టి చితకబాదారు. అంతే కాదు వారి పైశాచికత్వానికి పరాకాష్టగా వారి చేత పేడ తినిపించారు. మహబూబ్నగర్ జిల్లా తొర్రూరు కు చెందిన ఇద్దరు బాలురు తాము పెంచుకునే కుక్క కనిపించడం లేదని.. పట్టణ శివారులోని మామిడి తోటకు వెళ్లారు.

అయితే పిల్లలు కావడంతో వాళ్ళు మామిడికాయలు దొంగలించడానికి వచ్చారని కాపలాదారులు భావించి వారిని చెట్టుకు కట్టి.. చితకబాదారు. అంతటితో ఆగకుండా వారిచేత పేడ తినిపించిన ఘటన వెలుగులోకి వచ్చింది.  కాళ్లు మొక్కుతామని వేడుకున్నా వినకుండా చిత్రహింసలు పెట్టారు. అంతేకాక ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియో తీయడంతో వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులకు తొర్రూరు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. పిల్లలను హింసించిన ఇద్దరినీ అదుపులోకి తీసుకొని.. కేసు నమోదు చేశారు పోలీసులు.  

Read more RELATED
Recommended to you

Exit mobile version