నేటి నుంచి హైదరాబాద్‌లో సదర్ ఉత్సవాలు..

-

హైదరాబాద్ సదర్ ఉత్సవాలకు సమయం ఆసన్నమైంది. దున్నపోతుల విన్యాసాలకు యాదవ సోదరులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. గత ప్రభుత్వం సదర్ ఉత్సవాలను అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం నిర్వహించింది. ఈసారి కూడా అంతే వైభవంగా సదర్ వేడుకలను నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని రకాల ఏర్పాట్లను చేస్తున్నారు.

నేటి (ఆదివారం) ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో తెలంగాణ సదర్ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. దీపావళి వేళ నగరానికి దున్నపోతుల విన్యాసాలు ప్రత్యేక శోభను తీసుకురానున్నాయి. నారాయణగూడ, ఖైరాతాబాద్, ముషీరాబాద్, అమీర్ పేటతో పాటు హైదరాబాద్‌లోని యాదవ సోదరులు నార్త్ ఇండియా నుంచి బలమైన దున్నరాజులను తీసుకొస్తున్నారు. ఈ ఏడాది సదర్ సయ్యాటలతో నగరం దద్దరిల్లనుంది.

Read more RELATED
Recommended to you

Latest news