సాయి కృష్ణ కు అండగా ఉంటాం…కేటీఆర్

-

అమెరికాలో దుండగుల చేతిలో కాల్పులకు గురై చికిత్స పొందుతున్న మహబూబాబాద్ కు చెందిన విద్యార్థి సాయి కృష్ణ కు పూర్తి అండగా ఉంటామని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తెలిపారు. సాయి కృష్ణ కుటుంబ సభ్యులు మంగళవారం మధ్యాహ్నం బేగంపేట క్యాంపు కార్యాలయంలో కేటిఆర్ ని కలిసి తమ బిడ్డను ఆదుకునేందుకు ప్రభుత్వ సహకారాన్ని కోరారు. దీనిపై స్పందించిన కేటీఆర్… సాయి కృష్ణ తల్లిదండ్రులు వెంటనే అమెరికాకి వెళ్లేందుకు అవసరమైన అన్ని సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు.. కుటుంబ సభ్యులను సాయి కృష్ణ ఆరోగ్యం పరిస్థితిపై ఆరా తీశారు. రాష్ట్ర ప్రభుత్వం తరుఫున సాయి కృష్ణ కు అవసరమైన  తక్షణ వైద్య సహాయం గురించి అమెరికాలోని కాన్సల్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయానికి తమ ఎన్ఆర్ఐ శాఖ అధికారులు సమాచారం అందించామన్నారు.

వసరమైతే మరింత సహకారం కోసం కేంద్ర ప్రభుత్వం విదేశీ వ్యవహారాల శాఖ తరఫున సహాయం కోసం విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌తో మాట్లాడుతామని.. ఈ మేరకు మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు సీతారాం నాయక్ నేరుగా సుష్మాస్వరాజ్ గారిని కలిసిన్నట్లు కేటీఆర్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version