రూటు మార్చిన సాయి పల్లవి.. ఇక నుండి డిమాండే..

-

తెలుగు సినిమా హీరోయిన్లలో సాయి పల్లవి రూటే సెపరేటు. ఫిదా సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన అమ్మడు, ఆ తర్వాత ఎమ్ సీ ఏ, పడి పడి లేచే మనసు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె హీరోయిన్ గా నాగ చైతన్య హీరోగా లవ్ స్టోరీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దాంతో పాటు విరాట పర్వం కూడా లైన్లో ఉంది. ఐతే ఈ సినిమాలన్నీ నటనా ప్రాధాన్యమున్న చిత్రాలే కావడం విశేషం. తన దగ్గరకి గ్లామర్ పాత్రలు వస్తున్నా, అలాంటి పాత్రల్లో నటించనని తెగేసి చెప్పింది.

ఐతే ప్రస్తుతం సాయి పల్లవి తన పద్దతి మార్చుకుందట. తన దగ్గరకి వచ్చిన పాత్రలని వద్దని చెప్పకుండా పారితోషికం భారీగా డిమాండ్ చేస్తుందట. తనే కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా తన దగ్గరకే వస్తారు. అలా కాకుండా కొంచెం తనకి భిన్నంగా ఉన్న సినిమాల్లో కూడా నటించడానికి భారీ పారితోషికం తీసుకోవాలని అనుకుంటుందట. హీరోయిన్ల కెరీర్ కొద్ది కాలమే ఉంటుందన్న సంగతి తెలిసిందే. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని అందరూ భావిస్తుంటారు. అందులో సాయి పల్లవి కూడా చేరిపోయిందన్నమాట.

Read more RELATED
Recommended to you

Latest news