అభిమానులకు సడన్ ట్రీట్ ఇచ్చిన సాయి పల్లవి..!!

-

సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.  ప్రేమమ్ సినిమా ద్వారా మలయాళం ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. ఫిదా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై మొదటి పరిచయంతోనే అందరి మనసులను దోచుకుంది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకుంటూ లేడీ పవర్ స్టార్ అనిపించుకుంది ఈ ముద్దుగుమ్మ. పాత్రల ఎంపిక విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఉండే సాయి పల్లవి తనకు కోట్ల రూపాయలు ఇచ్చినా సరే అడల్ట్ సినిమాలలో కాదు కదా కనీసం గ్లామర్ షో చేయడానికి కూడా ఆమె ఇష్టపడదు.  దీన్నిబట్టి చూస్తే తన పాత్రలు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు.
ఇదిలా వుండగా గత కొద్ది రోజులుగా సాయి పల్లవి సినిమాలకు దూరం కాబోతోంది అంటూ వార్తలు అయ్యాయి. దీంతో అభిమానులు కూడా కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు.  అయితే ఇలాంటి సమయంలోనే సడన్ గా ట్రీట్ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ. చాలా రోజుల తర్వాత ఒక అందమైన ఫోటోని షేర్ చేస్తూ నెట్టింట యాక్టివ్ గా మారింది.  తన ఇంట్లో సోఫాలో కూర్చొని మనస్ఫూర్తిగా నవ్వులు చిందిస్తున్న ఒక ఫోటోను షేర్ చేస్తూ.. జీవితంలో “చిరునవ్వులు,  ఆశా, కృతజ్ఞత “ఉంటే చాలు అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

ఈమె షేర్ చేసిన ఫోటో నెట్టింట బాగా వైరల్ అవుతోంది.. అందులో ముఖ్యంగా తన పెట్ డాగ్ తో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త బాగా వైరల్ గా మారుతున్నాయి. ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే చివరిగా విరాటపర్వం సినిమాలో నటించింది . ఆ తర్వాత సూర్య నిర్మించిన గార్గి సినిమాలో నటించిన ఈమె ఇప్పటివరకు తన సినిమాలకు సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version