కమ్యూనిస్టు పుస్తకాలు చదివి.. సాయి పల్లవి మైండ్ దొబ్బింది – రాజాసింగ్

-

సాయి పల్లవి కామెంట్స్ పై బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మూవీ పాపులర్ కావాలని… తాము పాపులర్ కావాలని కొంతమంది నటులు, డైరెక్టర్లు వ్యవహరిస్తున్నారని.. సాయి పల్లవి కశ్మీర్ ఫైల్స్ సినిమా పై కామెంట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా కోసం కమ్యూనిస్టు పుస్తకాలు చదివి సాయి పల్లవి మైండ్ పాడైందని చురకలు అంటించారు రాజాసింగ్.

కాశ్మీర్ కి వెళ్లి పండితులను కలిస్తే జరిగిన ఘోరాలు తెలుస్తాయని.. కాశ్మీర్ పై వాస్తవాలు మాట్లాడే దమ్ము సాయి పల్లవికి లేదన్నారు. ఆవును తల్లిగా కొలుస్తాం.. ఆవును కాపాడుకున్నామనే సంతోషంలో నినాదాలు ఇస్తామని.. సాయిపల్లవిపై సుల్తాన్ బజార్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం.. FIR నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.

తెలంగాణ, ఏపీ అన్ని పోలీస్ స్టేషన్లలో సాయి పల్లవిపై ఫిర్యాదులు చేయాలని పిలుపు ఇచ్చామన్నారు. ఒక్క యాక్టర్ ని అరెస్ట్ చేస్తే ఎవరు హిందువుల జోలికి రారని.. యాక్టర్స్, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్స్ కి ఇస్లాం పై కామెంట్ చేసే ధైర్యం ఉందా అని నిలదీశారు. ఇప్పుడు ఉన్న హిందువులు శివాజీలాంటి వాళ్ళు.. హిందువుల పై నెగటివ్ గా మాట్లాడితే గుసాయించి కొడతారని ఫైర్ అయ్యారు రాజాసింగ్‌.

Read more RELATED
Recommended to you

Latest news