పవన్ కళ్యాణ్ పై సజ్జల సెటైర్లు!

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సెటైర్లు వేశారు. గెస్ట్ ఆర్టిస్టులా వచ్చి పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్తారని విమర్శించారు. సబ్ ప్లాన్ నిధులు దుర్వినియోగం అంటున్న పవన్ కళ్యాణ్ ఏ ఆధారాలతో అంటున్నారని ప్రశ్నించారు. సబ్ ప్లాన్ కంటే ఎక్కువ నిధులు అందిస్తున్నామన్నారు సజ్జల. లోకేష్, పవన్, చంద్రబాబులలో సీఎం అభ్యర్థి ఎవరు ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

జగన్ పాదయాత్ర సమయంలో జరిగినవి ఇప్పటికీ ఎవరికీ చెప్పలేదు అన్నారు. సకల శాఖల మంత్రి అని పవన్ తనపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పొత్తుల గురించి పవన్ చెప్పిన మూడు ఆప్షన్స్ నవ్వొస్తుందన్నారు సజ్జల. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సిబిఐ నోటీసులపై కూడా స్పందించారు సజ్జల. అవినాష్ వ్యవహారంలో రాజకీయ కుట్ర జరుగుతుందని ఆరోపించారు. అవినాష్ వ్యవహారంలో బిజెపిలో ఉన్న కొంతమంది టిడిపి స్లీపర్ సెల్స్ పనిచేస్తున్నాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అవినాష్ రెడ్డి సిబిఐకి పూర్తిగా సహకరిస్తారని చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version