పాలిచ్చేత‌ల్లుల‌కు స‌జ్జ‌న్నార్ గుడ్ న్యూస్..!

-

పోలీసు శాఖ‌లో ప‌నిచేసి త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపును తెచ్చుకున్న అధికారి స‌జ్జన్నార్ ఆర్టీసీ ఎండీగా కూడా త‌న సైల్ లో విధులు నిర్వ‌హిస్తున్నారు. ఇప్పటికే ప‌లు నిర్ణ‌యాలతో స‌జ్జ‌న్నార్ అంద‌రి దృష్టిని ఆర్టీసీ వైపు తిప్పారు. కాగా తాజాగా ఆయ‌న మ‌రో నిర్న‌యం తీసుకున్నారు. సాధార‌ణంగా బాలింత‌లు పిల్ల‌ల‌కు పాలిచ్చేందుకు బ‌స్టాండ్ల‌లో ఎంతో ఇబ్బంది ప‌డుతుంటారు. అయితే అలాంటి ఇబ్బందులు లేకుండా బస్టాండ్ల‌లో పాలిచ్చేందుకు ప్ర‌త్యేక కేంద్రాల‌ను ఏర్పాటు చేయాల‌ని స‌జ్జ‌న్నార్ నిర్ణ‌యం తీసుకున్నారు.sajjanar

అయితే మొద‌ట‌గా ఈ కేంద్రాల‌ను హైద‌రాబాద్ లోని ఎంజీబీఎస్ లో ప్రారంభించనున్నారు. ఆ త‌ర‌వాత రాష్ట్రంలోని అన్ని బ‌స్టాండ్ల‌లోనూ పాలిచ్చే కేంద్రాల‌ను ఏర్పాటు చేయాల‌ని స‌జ్జ‌న్నార్ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండ‌గా స‌జ్జ‌న్నార్ వినాయ‌క చ‌వితి సంధ‌ర్బంగా వినాయ‌కుడిని బ‌స్సులో తీసుకువెళ్లి నిమ‌ర్జ‌నం చేసిన సంగ‌తి తెలిసిందే.దాంతో ఆయ‌న పై ప్ర‌జ‌లు ప్ర‌శంస‌లు కురిపించారు.

Read more RELATED
Recommended to you

Latest news