“సలార్” మూవీ నైజాం హక్కులను కొనేసిన మైత్రి మూవ్స్ సంస్థ !

-

టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు అయిన రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు నటిస్తున్న సినిమాలు అన్నీ పాన్ ఇండియా వె కావడం విశేషం. డిసెంబర్ 22 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా సలార్ సినిమా విడుదల కానుంది. చాలా కాలంగా ఈ సినిమా కోసం ప్రభాస్ డై హర్ట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను బెస్ట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కించారు. ఇందులో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తుండగా, మిగిలిన పాత్రలలో జగపతి బాబు, పృథ్వీ రాజ్ సుకుమారన్ లాంటి హేమాహేమీలు నటించారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సలార్ మూవీ డిస్ట్రిబ్యూషన్ హక్కులను మేకర్స్ ఏరియాల వారీగా ప్రకటించారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో నైజాం ఏరియా డిస్ట్రిబ్యూషన్ హక్కులను మైత్రి మూవీ మేకర్స్ వారు దక్కించుకున్నారు. మరి ఎన్ని కోట్లకు దక్కించుకున్నారన్నది మాత్రం తెలియలేదు.

ఇక ఈ సినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడు ఎవుతుందా అని ఎదురుచూస్తున్న అభిమానులు మరో 28 రోజులు ఆగక తప్పదు.

Read more RELATED
Recommended to you

Latest news