తిరుమ‌ల‌లో డివోర్స్ గురించి అడిగిన రిపోర్ట‌ర్..స‌మంత రిప్లై తో షాక్..!

-

టాలీవుడ్ బ్యూటీ స‌మంత అక్కినేని ఈ రోజు తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. ఈ సంధ‌ర్బంగా ఓ మీడియా ప్ర‌తినిధిని స‌మంత‌ను విడాకుల‌కు సంబంధించి ప్ర‌శ్నించారు. మీరు నాగ చైత‌న్య విడాకులు తీసుకుంటున్నారు అంటూ వార్తలు వ‌స్తున్నాయి దానిపై మీ స్పంద‌న ఏంటి.?? అని ప్ర‌శ్నించ‌గా స‌మంత షాకింగ్ స‌మాధానం ఇచ్చారు. గుడికి వ‌చ్చావ్ బుద్ది ఉందా అంటూ రిపోర్ట‌ర్ కు స‌మాధానం ఇచ్చారు. అంతే కాకుండా స‌మంత మీడియా ప్ర‌తినిధి అడిగిన ప్ర‌శ్న‌కు సీరియ‌స్ గా చూస్తూ వెళ్లిపోయారు.

ఇదిలా ఉండ‌గా స‌మంత నాగ‌చైత‌న్య విడిపోతున్నారంటూ గ‌త కొద్దిరోజులుగా వార్త‌లు వ‌స్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కూ అటు చైతూ ఇటు స‌మంత ఇద్ద‌రూ కూడా స్పందించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలోనే మీడియా ప్ర‌తినిధి ప్ర‌శ్న‌వేయ‌గా స‌మంత గుడికి వ‌చ్చావ్ అంటూ దాట‌వేశారు. కానీ స‌మాధానం చెప్ప‌లేదు. అయితే అవున‌ని లేక‌పోతే అలాంటిదేమీ లేద‌ని చెప్పాలి కానీ సామ్ స‌మాధానం చెప్ప‌క‌పోవ‌డంతో ఇప్పుడు మ‌రిన్ని అనుమానాల‌కు దారితీసే అవ‌కాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news