సమంత ఇన్‌స్టా పోస్ట్‌ వైరల్‌

-

ప్రస్తుతం సమంత రెస్ట్ మోడ్ లో ఉన్న సంగతి తెలిసిందే. సినిమాలకు దూరంగా ఉంటూ కొన్ని నెలల పాటు విశ్రాంతికి పూనుకున్న ఈ హీరోయిన్.. ఇప్పుడు తన ఆరోగ్యం మీదే పూర్తి ఫోకస్ పెట్టింది. సంపూర్ణ ఆరోగ్యం కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఎన్నో ప్రయోగాలు చేస్తోంది. సమంత త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందా? అంటే అవుననే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. కెరీర్ లో వరుస ప్లాప్స్ తో కాస్త డల్ గా ఉన్న సమంత.. రీసెంట్ గా ఖుషి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

ఇదిలా ఉంటే సమంత కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. దీంతో ఎప్పటికప్పుడూ డిఫరెంట్ పోస్టులు పెడుతూ నెటిజన్స్ ను అట్ట్రాక్ట్ చేస్తుంది.లేటెస్ట్ గా సామ్ తన ఇన్‌స్టా‌ స్టోరీలో ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. భగవద్గీత చదువుతున్న ఫోటోస్ షేర్ చేసి, అందులో ఏ భాగాన్ని చదువుతుందో చూపించింది. దీంతో ఈ పోస్టును చూసిన నెటిజన్లు సమంత భగవద్గీత చదువుతూ జీవిత సత్యాలను నేర్చుకుంటుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ఇక సమంత బాలీవుడ్ లో ఫుల్ లెంత్ హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. అదికూడా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్కు జోడీగా. పవన్ కళ్యాణ్తో పంజా సినిమాను తెరకెక్కించిన స్టైలీష్ డైరెక్టర్ విష్ణువర్ధన్తో..బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఓ భారీ సినిమాను ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version