అబద్ధాలనే ఈ సమాజం నమ్ముతుంది అంటూ సమంత పోస్ట్ వైరల్.. అందుకేనా..?

-

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న సమంత.. తన భర్త నాగచైతన్యతో విడాకులు తీసుకొని ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆమెపై పలు రకాలుగా వార్తలు వినిపిస్తూ చాలా చర్చనీయాంశంగా మారింది. అయితే తరచుగా సమంత పెట్టె కొన్ని పోస్టులు నాగచైతన్య ను ఉద్దేశించి అని కొందరు భావిస్తూ ఉంటే ఆమె మాత్రం ఏదో ఒకటి యాదృచ్చికంగా పోస్ట్ పెడుతూ ఉందని మరికొంతమంది భావిస్తున్నారు. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక కొటేషన్ షేర్ చేసింది.Samantha's Groovy Fringed Dress Leaves The Internet Smitten. See Pics Here!నాగచైతన్య – సమంత ఏ మాయ చేసావే సినిమా షూటింగ్ లో బాగా పరిచయం అయి, ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారి .. ఆ తర్వాత ప్రేమగా మారడంతో పెద్దల అంగీకారంతో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే గత సంవత్సరం అక్టోబర్ నెలలో వీరిద్దరు విడిపోతున్నట్లు గా ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు వీరిద్దరూ ఎందుకు విడిపోతున్నారు అనే విషయంపై ఎవరు క్లారిటీగా చెప్పలేదు. కానీ సమంత మాత్రం తను పెట్టే పోస్ట్ ద్వారా తను ఎటువంటి తప్పు చేయలేదనే విషయాన్ని తెలియజేయాలని చూస్తోంది. అయితే ప్రతి ఒక్కరు మాత్రం విడాకుల విషయంలో సమంత తప్పు కాస్త తక్కువ అన్నట్లుగా కామెంట్లు చేస్తూనే ఉన్నారు.Samantha Still Values Naga Chaitanya But Just As A Friend? Her Instagram Actions Say So

కొంతమంది ఆమె మీద దుష్ప్రచారం చేయడంతో ఆమె కోర్టు మెట్లు ఎక్కడం కూడా జరిగింది. కోర్టు కూడా సమంతాకు అనుకూలంగా తీర్పు ఇవ్వలేకపోయింది. ఇక కోర్టు సమంత తో నువ్వు పబ్లిక్గా పోస్టులు పెట్టడం మానేయాలని తెలియజేసింది. పలు యూట్యూబ్ ఛానల్ లో కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ నుంచి ఒక ఫోటో ని షేర్ చేసిన సమంత అందులో ఏమని రాసింది అంటే.. నిజాలు అనేది అరుదుగా బయటకు వస్తాయి కానీ ఎప్పుడూ అబద్ధాలే ప్రచారంలో ఉంటాయి.. అంతేకాదు అబద్ధాలని ఈ సమాజం ఎక్కువగా నమ్ముతుంది అని ఆమె పోస్ట్ చేసింది. ఒక హాలీవుడ్ సినిమా గురించి ఆమె కామెంట్లు చేయడం జరిగింది. కానీ ఈ విషయాన్ని మాత్రం నెటిజన్స్ తన పర్సనల్ లైఫ్ విషయాలతో లింక్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news