శాంసంగ్ దివాలీ ఫెస్ట్‌.. 60 శాతం వ‌ర‌కు త‌గ్గింపు ధ‌ర‌లు..

-

ఎల‌క్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ ద‌స‌రా, దీపావ‌ళి పండుగ‌ల నేపథ్యంలో గ్రాండ్ దివాలీ ఫెస్ట్ పేరిట ఓ ప్ర‌త్యేక సేల్‌ను నిర్వ‌హిస్తోంది. ఈసేల్ ఇప్ప‌టికే ప్రారంభం కాగా న‌వంబ‌ర్ 16వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఇందులో అనేక ఉత్ప‌త్తుల‌పై ఏకంగా 60 శాతం వ‌ర‌కు రాయితీల‌ను అందిస్తున్నారు. అలాగే కొన్ని ప్రొడ‌క్ట్స్‌పై ఆఫ‌ర్ల‌ను అందిస్తున్నారు.

Samsung Diwali Fest offers up to 60 percent discount prices

శాంసంగ్ దివాలీ ఫెస్ట్‌లో భాగంగా కొనుగోలు చేసే వ‌స్తువుల‌ను శాంసంగ్ కేవ‌లం 2 నుంచి 3 రోజుల్లోనే డెలివ‌రీ ఇవ్వ‌నుంది. దేశ‌వ్యాప్తంగా 16వేల పిన్ కోడ్‌ల‌లో ఈ సౌక‌ర్యం అందుబాటులో ఉంద‌ని శాంసంగ్ వెల్ల‌డించింది. సేల్‌లో భాగంగా గెలాక్సీ ఎస్‌20 ప్ల‌స్ ఫోన్ల‌పై 40 శాతం వ‌ర‌కు రాయితీని అందిస్తున్నారు. ఎంపిక చేసిన యాక్స‌స‌రీలు, వైర్‌లెస్ చార్జ‌ర్లు, జేబీఎల్ స్పీక‌ర్ల‌పై 60 శాతం వ‌ర‌కు త‌గ్గింపు ధ‌ర‌ల‌ను పొంద‌వ‌చ్చు.

టీవీలు, ఇత‌ర ఉప‌క‌ర‌ణాల‌పై 45 శాతం వ‌ర‌కు త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందిస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ బ్యాంకుల‌తో శాంసంగ్ భాగ‌స్వామ్యం అయినందున ఆయా బ్యాంక్‌ల‌కు చెందిన క‌స్ట‌మ‌ర్లు ఆయా బ్యాంకుల కార్డుల‌తో శాంసంగ్ ఉత్ప‌త్తుల‌ను కొనుగోలు చేస్తే గ‌రిష్టంగా 12.5 శాతం వ‌ర‌కు క్యాష్ బ్యాక్ పొంద‌వ‌చ్చు.

అక్టోబ‌ర్ 25వ తేదీ వ‌ర‌కు సేల్‌లో గెలాక్సీ నోట్ 20 ని కొన్న‌వారికి రూ.10వేల వ‌ర‌కు ఇన్‌స్టంట్ క్యాష్ బ్యాక్ ఇస్తారు. గెలాక్సీ నోట్ 20 అల్ట్రాని కొన్న‌వారికి రూ.7వేల క్యాష్ బ్యాక్‌తోపాటు రూ.13వేల శాంసంగ్ వోచ‌ర్ ఇస్తారు. ఇవే కాకుండా అనేక ఆఫ‌ర్ల‌ను శాంసంగ్ అందిస్తోంది. మరిన్ని వివ‌రాల‌కు శాంసంగ్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news