BREAKING : బండి సంజయ్‌ పాదయాత్రకు హైకోర్టు అనుమతి

-

BREAKING : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్రకు తెలంగాణ హై కోర్టు అనుమతి ఇచ్చింది. బండి సంజయ్‌ పాదయాత్రకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. బైంసా సిటీకి 3 కిలోమీటర్ల దూరంలో సభ నిర్వహిస్తేనే అనుమతించాలన్న కోర్టు… బైంసా సిటీలోకి వెళ్లకుండా పాదయాత్ర కొనసాగించాలని సూచనలు చేసింది.

ఇక హై కోర్టు తుదితీర్పు నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేతలతో బండి సంజయ్ సమావేశం అయ్యారు. బైంసాలోకి పాదయాత్ర వెల్లట్లేదని కోర్టుకు తెలిపారు బీజేపీ లాయర్లు. కాగా, తెలంగాణ హై కోర్టు అనుమతి ఇవ్వడంతో మరి కొద్దిసేపట్లో కరీంనగర్ నుండి బైంసాకు బయలుదేరుతున్నారు బండి సంజయ్, బీజేపీ శ్రేణులు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version