“సర్కారు వారి పాట” సినిమా సెకండ్ సింగిల్ కు ముహూర్తం ఖరారు

-

టాలీవుడ్‌ స్టార్‌ హీరో, ప్రిన్స్‌ మహేష్‌ బాబు ప్రస్తుతం చేస్తున్న సినిమా “సర్కారు వారి పాట”. ఈ సినిమాకు టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ పరుశురాం దర్శకత్వం వహిస్తున్నారు. పొలిటికల్ అండ్ మాస్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు… మహానటి కీర్తిసురేష్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కు నవీన్ ఎర్నేని, వై రవి శంకర్ మరియు గోపి ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఇక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది.ఇది ఇలా ఉండగా సర్కారు వారి పాట సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన కళావతి సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో రేపు ఈ సినిమా నుంచి రెండో పాట విడుదల కానుంది. అయితే రేపు రెండో పాట విడుదల చేస్తారా లేక టీజర్ వదులుతారా ? అనేది తెలియాల్సి ఉంది. కానీ రేపు పాట అనౌన్స్మెంట్ ఉంటుందని ఓ పోస్టర్ మాత్రం విడుదల చేసిన చిత్ర బృందం. దీంతో ప్రిన్స్ మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version