షర్మిలకు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు: సత్య కుమార్

-

బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అయ్యాయి. జాతీయ స్థాయిలో జరిగే వ్యవహారాల పై మాకు అవగాహన ఉండదు అని ఆయన అన్నారు. అలాంటి విషయాలపై స్పందించడం సరికాదని చెప్పారు. మాకు కొన్ని పరిమితులు ఉంటాయి అని చెప్పారు. రాష్ట్రంలో ఏం జరగబోతుందో మీరే చూస్తారు అని అన్నారు. అలానే తినబోతూ రుచి అడగవద్దు అన్నారు.

జరుగుతున్న ప్రచారాలు చూస్తే, మూడు నాలుగు రోజుల్లో క్లారిటీ వచ్చేస్తుంది అని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ అన్నారు. రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో ప్రజా కంటక పాలన అంతం కావాలన్నారు. ఆ నినాదంతోనే రాష్ట్ర బిజెపి నాయకత్వం పనిచేస్తుంది అన్నారు. అలానే షర్మిలకు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు అన్నారు. ముందు ప్రత్యేక హోదా అంటే ఏంటో తెలుసుకొని మాట్లాడాలని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news