టోక్యో: ఒలింపిక్స్లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. క్రీడాకారులు అద్భుతంగా రాణిస్తున్నారు. ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్ ఫైనల్కు చేరింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత షూటర్ సౌరబ్ చౌదరీ అర్హత సాధించారు. 586 పాయింట్లతో సౌరబ్ చౌదరీ అగ్రస్థానంలో నిలిచారు. మరో భారత షూటర్ అభిషేక్ వర్మ ఫైనల్స్కు చేరుకోలేకపోయారు. 575 పాయింట్లతో 17వ స్థానంలో నిలిచారు.
అయితే 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల క్వాలిఫికేషన్లో భారత్కు నిరాశ మిగిలింది. భారత మహిళా షూటర్లు ఫైనల్కు చేరలేకపోయారు. 625.5 పాయింట్లతో 16వ స్థానంలో ఎలవెనిన్ వలేరియన్ నిలిచారు. 621.9 పాయింట్లతో 36వ స్థానంలో అపూర్వి చందేలా 36వ స్థానంలో నిలచారు.