బ్రేకింగ్ : సీఎం జగన్ ఇంట్లో కరోనా… 10 మందికి పాజిటివ్…!

-

security officials at cm jagan mohan reddy house are tested with corona positive
security officials at cm jagan mohan reddy house are tested with corona positive

నిన్న సీఎం కేసీఆర్ నివాసంలో నేడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇంట్లో…! ఏం జరిగిందో తెలియాలంటే ఈ వార్తా చదవండి. కరోనా మహమ్మారి దూకుడు ఎక్కువయ్యింది..! ఎప్పుడు, ఎక్కడికి, ఎలా వెళుతుందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఎన్నో కఠిన చర్యలు చేపట్టే వారి పై కూడా ఈ మహమ్మారి ఎఫెక్ట్ చూపుతుంది, వారు ఎన్ని కఠిన చర్యలు చేపట్టినా ఏదో ఒక తావు చూసుకొని వారి దగ్గరకు వెళ్లిపోతుంది. తాజాగా సీఎం కేసీఆర్ అధికారిక నిలయం అయిన ప్రగతీ భవన్ లోని 5 మంది సిబ్బంధికి కరోనా సోకడం తెలిసిందే ఇక ఇదే నేపద్యంలో తాడేపల్లి లోని సీఎం జగన్ నిలయానికి కూడా ఈ మహమ్మారి వెళ్లిపోయింది.

జగన్ ఇంటి వద్ద ఉండే సెక్యూరిటీ సిబ్బంధికి దాదాపుగా 10 మందికి కరోనా సోకిపోయింది. ఏపీఎస్పీ కాకినాడ బెటాలియన్‌కు చెందిన 8 మంది సెక్యూరిటీ గార్డులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. మరో బెటాలియన్‌కు చెందిన ఇద్దరు గార్డులు కరోనా పాజిటివ్‌గా తేలారు. ఈ నెల 2న సీఎం నివాసం వద్ద గార్డులకు కరోనా టెస్టులు నిర్వహించారు. అయితే టెస్టుల ఫలితాలను ఈ రోజు వెల్లడించారు. ఈ పలితాల్లో పది మంది వైరస్ నిర్ధారణ అయింది. గతంలో కూడా సీఎం నివాసం వద్ద ఇద్దరికీ కరోనా సోకిన విషయం తెలిసిందే ఇక ఇదే తరహాలో ఇప్పుడు 10 కి కరోనా సోకడం ఏపీ లో కలకలం రేపుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news