ఈ గెలుపు పరంపర 11-0కు చేరుకోవాలి : సెహ్వాగ్

-

నెదర్లాండ్స్ తో వన్డేలో కోహ్లీ, రోహిత్ బౌలింగ్ చేసి వికెట్లు తీయడంపై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సంతోషం వ్యక్తం చేశారు. ‘వీరిద్దరూ వికెట్లు సాధించడం మంచి దీపావళి కానుక. ప్రస్తుతం వరుసగా 9-0 విజయాలతో ఉన్న టీం రికార్డ్….మరో వారంలో 11-0గా మారుతుందని ఆశిస్తున్న’ అని ట్వీట్ చేశారు. కాగా, భారత్ సెమీస్, ఫైనల్ లో విజయం సాధిస్తే wc సొంతం చేసుకోవడంతో పాటు గెలుపు రికార్డు 11-0కు చేరుకుంటుంది.

sehwag comments on team india

ఇది ఇలా ఉండగా..  ఈసారి భారత్ కచ్చితంగా ప్రపంచకప్ సాధిస్తుందని టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ ధీమా వ్యక్తం చేశారు. నిన్నటి మ్యాచ్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు వికెట్లు తీసి ప్రపంచంలో ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ దీపావళి కానుక ఇచ్చారని అభినందించారు. సెమీఫైనల్, ఫైనల్లోను భారత్ ఇదే జోరు కొనసాగించాలని గబ్బర్ ఆకాంక్షించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version