SEMIFINAL 2 :వర్షంతో మ్యాచ్ జరక్కపోతే ఫైనల్ చేరేదెవ్వరు ?

-

నిన్న ముగిసిన సెమి ఫైనల్ 1 మ్యాచ్ లో ఇండియా కివీస్ ను అన్ని విభాగాలలో అద్భుతంగా రాణించి ఫైనల్ కు దూసుకు వెళ్ళింది. ఇక ఇండియాతో ఆడే ప్రత్యర్థి ఎవరన్న విషయం తెలియాల్సి ఉండగా, ఈ రోజు ఆస్ట్రేలియా మరియు సౌత్ ఆఫ్రికా లు ఈడెన్ గార్డెన్స్ లో తలపడుతున్నాయి. మొదట బ్యాటింగ్ చేస్తున్న సౌత్ ఆఫ్రికా నాలుగు వికెట్లు కోల్పోయి చాలా కష్టాల్లో ఉండగా, ఓవర్లు ముగిసే సమయానికి వర్షం రావడంతో స్వల్ప సమయం మ్యాచ్ ను ఆపివేశారు. దీనితో ఒక సందేహం అందరి మదిలోకి వచ్చింది, ఒకవేళ మ్యాచ్ వర్షం వలన ఫలితం తేలకపోతే విజేత ఎవరు అని.. ఇందుకు క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నది. ఈ మ్యాచ్ వర్ష వలన ఈ రోజు జరగకపోతే రేపు రిజర్వు డే ఉంటుంది..

రేపు కూడా మ్యాచ్ జరగకుండా, కనీసం డక్ వర్త్ లూయిస్ ద్వారా ఫలితం తేలకపోతే అప్పుడు గ్రూప్ దశలో ఆస్ట్రేలియా కన్నా ఎక్కువ పాయింట్లు ఉన్న సౌత్ ఆఫ్రికా ఫైనల్ కు చేరుకుంటుంది. మరి ఏమి జరగనుందో తెలియాలంటే మరి కాసేపు వెయిట్ చేయాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version