మనసు మమత సీరియల్ నటి సూసైడ్ !

-

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. నిన్ననే సీనియర్ నటుడు జయప్రకాష్ రెడ్డి గుండెపోటుతో మరణించగా నిన్న రాత్రి మరో నటి సూసైడ్ చేసుకుని చనిపోయింది. తెలుగు బుల్లితెరలో లీడింగ్ సీరియల్స్ లో నటిస్తోన్న శ్రావణి అనే నటి నిన్న రాత్రి సూసైడ్ చేసుకున్నట్టు సమాచారం. ఆమె సూసైడ్ చేసుకోవడానికి లవ్ ఫైల్యూర్ కారణంగా తెలుస్తోంది.

ఈమె సంజీవ రెడ్డి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మధురానగర్ లోని తన నివాసంలో నినా రాత్రి ఉరివేసుకొని చనిపోయారు. ఈమె మనసు మమత, మౌన రాగం సీరియల్స్‌ లో నటించి మంచి పేరు తెచ్చుకుంది, శ్రావణి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఆత్మహత్య అని మీడియాకి చెప్పినా పోలీసులు ఇంకా నిర్ధారించలేదని అంటున్నారు. ఇప్పటికి అయితే అనుమానాస్పద మృతిగానే కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకి సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news