నువ్వేం చేస్తావో చెప్పు.. లేదంటే మాట్లాడకుండా ఊరుకో..కేటీఆర్ కి షబ్బీర్ అలీ ఛాలెంజ్

-

బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ , ఎమ్మెల్యే కేటీఆర్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్‌ అలీ సవాల్‌ విసిరారు. బీఆర్‌ఎస్‌ హయాంలో 46 మందిని పార్టీలో చేర్చుకున్నారని ,తాను చెప్పిన వివరాలు తప్పని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని షబ్బీర్ అలీ ఛాలెంజ్‌ చేశారు.

మరి కేటీఆర్‌ ఏం చేస్తారో చెప్పాలని అన్నారు. తలసాని తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయకుండానే మంత్రిని చేసింది కేటీఆర్ అని పేర్కొన్నారు. మండలిలో తాను ప్రతిపక్ష నేతగా ఉన్నా… దాన్ని లేకుండా చేసింది కేటీఆరేనని ఆరోపించారు. తేదీల వారీగా కేటీఆర్‌ ఎమ్మెల్యేలను చేర్చుకున్న లిస్ట్ చెప్పడానికి కూడా రెడీ అన్నారు. కోనేరు కోనప్ప, ఇంద్రకరణ్ రెడ్డి, విఠల్ రెడ్డి… ఇలా వరుస బెట్టి చేర్చుకున్నది కేటీరేనని అన్నారు. తాను చెప్పిన వివరాలు తప్పు అని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని ,నువ్వేం చేస్తావో చెప్పు.. లేదంటే మాట్లాడకుండా ఊరుకో అంటూ షబ్బీర్ అలీ చాలెంజ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version