ముంబై కి వెళ్ళనున్న ఏపీ సీఎం చంద్రబాబు.. ఎందుకంటే..?

-

ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు శనివారం సాయంత్రం 4 గంటలకు ముంబై వెళ్లనున్నారు. అనంత్ అంబానీ వివాహానికి చంద్రబాబు హాజరుకానున్నారు. ఆదివారం తిరిగి అమరావతికి చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు.

అయితే ఉండవల్లి నివాసం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం రోడ్డు మార్గాన మంగళగిరికి చేరుకుంటారు. కొలనుకొండ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన ఉదయం 9 గంటల 30 నిమిషాలకు పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు ముంబైకు బయల్దేరి వెళ్తారు. ఇప్పటికే ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ నాయకులు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version