ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ గా షమర్ జోసెఫ్

-

ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా వెస్టిండీస్ పేస్ సంచలనం షమర్ జోసెఫ్ నిలిచారు. జనవరి నెల ప్రదర్శనకుగానూ అతడికి ఈ అవార్డు లభించింది. ఓలీ పోప్, జోష్ హేజిల్వుడ్ లాంటి హేమాహేమీలను కాదని జోసెఫ్ను ఈ అవార్డు వరించింది.

 

గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సంచలన ప్రదర్శన చేసిన వెస్టిండీస్‌ యంగ్ పేసర్‌ షమర్‌ జోసెఫ్‌ 7 వికెట్లు తీసి తన జట్టుకు సంచలన విజయాన్ని కట్టబెట్టారు.కేవలం రెండు టెస్ట్ మ్యాచ్‌ల తర్వాత ఓవర్‌ నైట్‌ హీరోగా మారిపోయాడు.ఈ ప్రదర్శనతో ప్రపంచంలోనే రిచెస్ట్ లీగ్‌గా పేరొందిన ఐపీఎల్‌లో ఆడబోతున్నాడు. లక్నో సూపర్‌ జెయింట్స్‌ తరఫున ఈ 24 సంవత్సరాల పేసర్‌ రానున్న సీజన్‌లో ఆడనున్నాడు. మార్క్‌ వుడ్‌ ప్లేస్ లో షమర్‌ను టీంలోకి తీసుకుంది. ఈ విషయాన్ని లక్నో జట్టు సోషల్‌ మీడియా వేదికగా పేర్కొన్నారు. అంతేకాకుండా PSL, ILT20 వంటి మెగా టోర్నీల నుంచి ఆయన పిలుపు అందుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news