మంత్రి నిరంజన్ రెడ్డివి చేతకానీ మాటలు – వైఎస్‌ షర్మిల

-

తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి మంత్రి నిరంజన్ రెడ్డి గారివి చేతకానీ మాటలని వైఎస్‌ షర్మిల చురకలు అంటించారు. పంట లేటుగా వేస్తే, గాలివాన వస్తే సీఎం ఆప్తాడా అని చేతకాని మాటలు చెబుతున్న మంత్రి నిరంజన్ రెడ్డి గారు, వరి వేస్తే ఉరేనని పంటలు లేట్ గా వేసుకునేలా చేసింది ఎవరు ? అని నిలదీశారు వైఎస్‌ షర్మిల.

కొనం కొనం అని చివరకు కొంటానన్న సన్నాసులు ఎవరు? వానలు వచ్చేకంటే నెల రోజుల ముందే కల్లాల్లో వడ్లు పోసి రైతు తయ్యారుగుంటే మీరేం చేస్తున్నారు ? అని ప్రశ్నించారు. ఎన్ని వడ్లు కొంటానని ఎన్ని కొన్నారు? కాంటాలు పెట్టడం, టార్పాలీన్లు, సంచులు ఇవ్వడం చేతకాలేదు కానీ,పంటలు లేటుగా వేసుకొన్నారు కాబట్టే వర్షానికి వడ్లు తడిసే పరిస్థితి వచ్చింది అని రైతులదే తప్పని చెప్తున్నారా? అని నిలదీశారు.

వడ్లు పండించినందుకు రైతును దోషిని చేస్తున్నారా? అని ఫైర్‌ అయ్యారు వైఎస్‌ షర్మిల. రైతు కష్టం వానల్లో కొట్టుకుపోతుంటే,చెమటోడ్చి పండించిన పంట కాలువల్లో తేలిపోతుంటే,చేతులతో ఎత్తుకోలేక,కల్లాల్లో రైతు కన్నీరు పెడుతుంటే KCR దొరగారికి రైతుల కష్టాలు కనపడ్తలేవా? అని నిప్పులు చెరిగారు వైఎస్‌ షర్మిల.

Read more RELATED
Recommended to you

Exit mobile version