జగన్‌ కి షర్మిల షాక్.. పులివెందుల బరిలో చిన్నమ్మ..!

-

ఏపీ పొలిటికల్స్ లోకి షర్మిల ఎంట్రీ ఇవ్వడం తో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. 21న ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా షర్మిల బాధ్యతలు చేపట్టింది. ఆ తరవాత కీలక నిర్ణయాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్పారు. దీనిలో భాగంగా వచ్చే ఎన్నికల్లో పులివెందుల నుండి జగన్‌ మీద వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మను కాంగ్రెస్ పార్టీ బరిలో ఉంచేందుకు చూస్తోంది.

YS Sharmila sensational announcement soon

వివేకానంద రెడ్డి హత్య తరవాత రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో విభేదాలు, షర్మిల జగన్‌కి మధ్య గ్యాప్ చూసాము. షర్మిల కాంగ్రెస్ పార్టీ లో చేరడం తో అన్న పై నేరుగా యుద్ధం చేయటానికి సిద్ధం అయినట్టు తెలుస్తోంది. దీనిలో భాగం గానే చిన్నమ్మను పులివెందుల నుంచి బరిలో ఉంచాలని షర్మిల భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news