కేసీఆర్ కొత్త గెటప్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు..ఊసరవెళ్లి అంటూ !

-

ఇటీవల బీహార్‌ పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్.. తలపాగ పెట్టుకుని.. అందరినీ ఆశ్చర్య పరిచారు. అయితే.. కేసీఆర్ కొత్త గెటప్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తలపాగా పెట్టుకుని కొత్త వేషం కట్టాడు కేసీఆర్. ఊసరవెళ్లి కూడా కేసీఆర్ దగ్గరే పాఠాలు నేర్చుకోవాలని చురకలు అంటించారు.

మన రాష్ట్రంలో ఎంతమంది రైతులు, నిరుద్యోగులు చచ్చిపోయిన కనీసం దిక్కు చూడని కేసీఆర్.. పక్క రాష్ట్రం రైతుల తరఫున నిలబడతాడట అంటూ షర్మిలమ్మ మండిపడ్డారు. కేసీఆర్ ఒక మాటకారి, మోసకారి. హామీలు ఇవ్వడం తప్ప ఆచరణ చేతకాదని ఆగ్రహించారు.

ప్రశ్నించాల్సిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కేసీఆర్ కు అమ్ముడు పోయాయి. ప్రజల తరుఫున ప్రశ్నించేందుకే YSR తెలంగాణ పార్టీ ఆవిర్భవించిందని వెల్లడించారు. ప్రజలం తా ఉద్యమించి తెలంగాణ తెచ్చుకుంటే.. KCR మాత్రం దళిత ముఖ్యమంత్రి అంటూ దగా చేసి, తానే గద్దెనెక్కి కమీషన్లు దోచుకుని, ఆంధ్రా కాంట్రాక్టర్లకు తెలంగాణ సొమ్మును కట్టబెడుతుండని ఆరోపణలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news