బాలీవుడ్ హీరోయిన్ పై శిల్పా శెట్టి రూ. 50 కోట్ల పరువు నష్టం దావా

-

ఫోర్న్ వీడియోల కేసులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా.. అడ్డంగా బుక్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఆమె భర్త రాజ్ కుంద్రా ఈ ఫోర్ వీడియో ల కేసులో ఇటీవలే బెయిల్ పై బయటకు వచ్చారు. ఇక ఈ నేపథ్యంలోనే శిల్పాశెట్టి మరియు రాజ్ కుంద్రా లపై… బాలీవుడ్ స్టార్ హీరోయిన్ షెర్లిన్ చోప్రా.. ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది.

రాజ్ కుంద్రా మరియు శిల్పా శెట్టి తనపై లైంగిక దాడికి కూడా ప్రయత్నించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే… షెర్లిన్ చోప్రా పై శిల్పాశెట్టి మరియు రాజ్ కుంద్రా లు న్యాయపరమైన చర్యలకు శ్రీకారం చుట్టారు.

తమ పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించిందని షెర్లిన్ చోప్రాపై ఏకంగా 50 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు శిల్పా శెట్టి దంపతులు. షెర్లిన్ చోప్రా తమపై నిరాధార మైన ఆరోపణలు చేస్తోందని… దీని కారణంగా తమ పరువు పోతుందనే నేపథ్యంలోనే తాము ఈ పరువు నష్టం దావా వేస్తున్నామని శిల్పా శెట్టి పేర్కొంది. డబ్బులు డిమాండ్ చేసేందుకే షెర్లిన్ చోప్రా ఇలా వ్యవహరిస్తోందని అంటూ ఆరోపించింది శిల్పాశెట్టి.

Read more RELATED
Recommended to you

Latest news