ఎమ్మెల్యే పదవికి శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా

-

మధ్యప్రదేశ్‌లోని బుధని నియోజకవర్గం ఎమ్మెల్యే పదవికి కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా చేశారు.ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో విదిషా నియోజకవర్గం నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. దీంతో మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. బుధని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేటప్పుడు చాలా భావోద్వేగానికి గురయ్యానని ఈ సందర్భంగా శివరాజ్ అన్నారు.

బుధని నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వకంగా సేవలందించానని, ప్రజల అభిమానం చూరగొనేందుకే తన యావజ్జీవితం అంకితం చేశానని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.మునుముందు కూడా తన శక్తి మేరకు ప్రజా సేవకు పునరంకితమవుతానని తెలిపారు. మధ్యప్రదేశ్ సీఎంగా నాలుగు సార్లు శివరాజ్ సింగ్ సేవలందించారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో విదిషా నుంచి 8.21 లక్షలకు పైగా ఓట్ల మార్జిన్‌తో ఆయన గెలిచారు.

 

Read more RELATED
Recommended to you

Latest news