తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం

-

తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుంది. నారాయణగిరి షెడ్ల వరకు అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. స్వామివారిని నిన్న 75,125 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 31,140 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.5.41 కోట్లు సమకూరిందని అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news